వారణాసి: ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన సర్వేలో లభించిన సాక్ష్యాధారాలను పరిరక్షించాలని, దస్తావేజు రూపం లో భద్రపరచాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఆదేశించింది.
హిందూ మతానికి, హిందూ ఆరాధనా విధానానికి, చారిత్రక, పురావస్తుకు సంబంధించిన అన్ని వస్తువులు, మెటీరియల్స్ను జిల్లా మేజిస్ట్రేట్కు లేదా ఆయన నియమించిన ఇతర అధికారికి సమర్పించాలని వారణాసి కోర్టు సూచించింది.