న్యూఢిల్లీ: సెలూన్లోకి చొరబడిన దుండగులు ఇద్దరి వ్యక్తులపై ‘పాయింట్ బ్లాంక్’ రేంజ్లో కాల్పులు జరిపి హత్య చేశారు. (Gunmen Open Fire Inside Hair Salon) అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నజాఫ్గఢ్ ప్రాంతంలోని ఒక సెలూన్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించారు. క్షౌరం చేయించుకుంటున్న వ్యక్తి తలపై ఒకడు దగ్గరగా గన్తో కాల్పులు జరిపాడు. మూసి ఉన్న డోర్తోపాటు మరో వ్యక్తిపై రెండో దుండగుడు కాల్పులు జరిపాడు. ఇది చూసి అక్కడున్న ఒక మహిళతో పాటు మరికొందరు భయాందోళన చెందారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. దుండగుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు తెలుసుకున్నారు. ఆ సెలూన్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీలో నేరాలు, ఘోరాలు పెరుగుతుండటంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
देखिए नजफगढ़ गोली कांड का सीसीटीवी फुटेज सामने आया @DelhiPolice https://t.co/FjiLPCEhaR pic.twitter.com/rRL9E3JnDn
— Lavely Bakshi (@lavelybakshi) February 9, 2024