జమ్ము, ఆగస్టు 27: కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని, మరో 15 రోజుల్లో జమ్ముకశ్మీర్లో తొలి శాఖ ప్రారంభం కావొచ్చని ఆయన సన్నిహితుడు జీఎం సరూరీ చెప్పారు.
శనివారం సరూరీ విలేకరులతో మాట్లాడుతూ ‘మా నాయకుడు ఆజాద్ లౌకికవాది. ఆయన బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవం’ అని పేర్కొన్నారు.