Bhavesh Bhandari | గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త భావేష్ భాయి భండారీ తన భార్యతోపాటు కలిసి సన్యాసం తీసుకోవాలని సంకల్పించారు. ఇందుకోసం తన రూ.200 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చేశారు. జైన మతానికి చెందిన భావేష్ భాయి భండారీ కటుంబానికి దైవభక్తి ఎక్కువ. సన్యాసం తీసుకోవాలని నిర్ణయించడంతో సుదీర్ఘకాలంగా నిర్మాణ రంగ వ్యాపారంతో తనకు ఉన్న అనుబంధానికి ఆయన స్వస్తి పలికారు.
ఇప్పటికే ఆయన పిల్లలు 2022లోనే సన్యాసం తీసుకున్నారు. తన కొడుకు, కూతురు బాటలోనే భావేష్ బాయి భండారీ దంపతులు పయనించనున్నారు. ఇందుకోసం ఆధునాతన వసతులు.. ఫ్యాన్లు, మొబైల్ ఫోన్ల వాడకం, ఎయిర్ కండిషనర్ల వాడకానికి దూరంగా ఉండనున్నారు. సన్యాసులుగా కేవలం బిక్షాటనపైనే జీవనం సాగిస్తారు. ఈ నెల 22న భావేష్ భాయి భండారీ దంపతులు సన్యాసం స్వీకరించనున్నారు.