Gujarat poll results | గుజరాత్లోని మోర్బీ నియోజకవర్గంలోని మోర్బీలో బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృతియా ముందంజలో ఉన్నారు. అక్టోబర్లో సస్పెన్షన్ వంతెన కూలిన ఘటనలో 140 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అధికార బీజేపీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఎన్నికలు జరగ్గా మోర్బీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ జయంతి పటేల్ను బరిలోకి దింపింది. మరో వైపు ఆప్ పార్టీ పంకజ్ రన్సారియాను పోటీలో నిలిపింది. మోర్బీలో జరిగిన ఘోర వంతెన ప్రమాదంలో పలువురి ప్రాణాలను కాంతిలాల్ అమృతియా కాపాడినట్లుగా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
మోర్బీ పట్టణ శివారులో జరిగిన వంతెన కూలిన ఘ టనలో దాదాపు 140 మంది చెందగా.. దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజ్కోట్ ఎంపీ మోహన్ కుందారియా బంధువులు 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరమ్మతుల కోసం వంతెనను మూసివేయగా.. ప్రమాదం జరిగిన నాటికి ఐదు రోజుల ముందు వంతెనపై ప్రజలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత వంతెన కూలిపోయింది. ‘ఫిట్నెస్ సర్టిఫికెట్’ జారీ చేయకుండా మరమ్మతులు చేపట్టిన కంపెనీ వంతెనను తిరిగి ప్రారంభించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ హవా కొనసాగుతున్నది. 1995 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఆ పార్టీ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటి వరకు 156 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.