న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్షా ఫేక్ వీడియో కేసులో గుజరాత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎడిటెడ్ వీడియో అప్లోడ్ చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సహాయకుడు సతీశ్ వన్సోలా, ఆప్ నాయకుడు రమేశ్భాయ్ బారియాను అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు వివిధ విపక్ష పార్టీలకు చెందిన మరో 12 మందికి నోటీసులు జారీచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా పేర్కొన్నట్టు ఉన్న ఓ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.