(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ‘గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (గుజరాత్ను నేనే తయారుచేశాను) అంటూ ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆర్భాటంగా ప్రకటించుకొన్నారు ప్రధాని మోదీ. అయితే, 27 ఏండ్ల బీజేపీ పాలనలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే, గుజరాత్ సామాజికంగా ఎంతో వెనుకబడిపోయింది. రాష్ట్రంలోని ప్ర
గుజరాత్ కంటే 22 రాష్ర్టాలు మెరుగ్గా..
దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) బతుకీడుస్తున్న కుటుంబాల సంఖ్య గుజరాత్లో అంతకంతకూ పెరిగిపోతున్నది. 2020తో పోలిస్తే 2021లో కొత్తగా 2,558 కుటుంబాలు పేదరికంలోకి దిగజారాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం 1.21 కోట్ల కుటుంబాల్లో బీపీఎల్ క్యాటగిరీలో 31,56,541 కుటుంబాలు (25 శాతం) ఉన్నాయి. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వమే అసెంబ్లీకి వివరాలు వెల్లడించింది. గుజరాత్లోని ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారని, పేదరికం విషయంలో గుజరాత్తో పోలిస్తే దేశంలో 22 రాష్ర్టాలు, కేంద్రపాలితప్రాంతాలు (యూటీలు) మెరుగైన స్థితిలో ఉన్నాయని నీతి ఆయోగ్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదికలు తేల్చిచెప్పాయి.
కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, గోవా, తమిళనాడు, డయ్యూ-డామన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్, చండీగఢ్, పంజాబ్, జమ్ముకశ్మీర్, సిక్కిం, మణిపూర్, మిజోరం, త్రిపుర
పేదరికంలో గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్న రాష్ర్టాలు/యూటీలు-22