Raghavji Patel : గుజరాత్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి రాఘవ్జీ పటేల్కు (Raghavji Patel) జామ్నగర్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రాధమిక చికిత్స అనంతరం రాజ్కోట్ తరలించారు.
బ్రెయిన్ స్ట్రోక్కు గురైన మంత్రి పటేల్ తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడుతోందని సైనర్జీ ఆస్పత్రి న్యూరోసర్జన్ డాక్టర్ సంజయ్ తిలాల పేర్కొన్నారు.
మంత్రి జామ్నగర్లో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో ఆయన బ్రెయిన్లో కుడి భాగంలో స్ట్రోక్ వచ్చిందని స్ధానిక ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం తమ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. జామ్నగర్ (రూరల్) నియోజకవర్గానికి రాఘవ్జీ పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read More :
Haryana | రైతుల చలో ఢిల్లీ.. హర్యానాలో బల్క్ ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు బంద్