అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలో ఘోరం జరిగింది. మామిడి తోట కావలి పడుకున్న ఓ 35 ఏండ్ల వ్యక్తి సింహం పంజాకు బలయ్యాడు. జిల్లా గిర్ ఫారెస్ట్ డివిజన్లోని తలాలా రేంజ్లోగల మధుపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బహదూర్భాయ్ జీవాభాయ్ (35) అనే వ్యక్తి ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా గ్రామం సమీపంలోని ఓ మామిడి తోట కావలి పడుకున్నాడు.
అయితే, ఈ తెల్లవారుజామున సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ సింహం అతనిపై దాడి చేసింది. ముందుగా తన మంచానికి కొద్ది దూరంలో కట్టేసిన మేకపై సింహం దాడి చేయగా.. జీవభాయ్ దాన్ని తరిమేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ సింహం జీవాభాయ్పై దూకి చంపేసింది. అరుపులు విని వెళ్లిన గ్రామస్తులు సింహాన్ని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ సింహాన్ని బంధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?