ముంబై: బాలీవుడ్కు చెందిన ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా అస్వస్థత, కళ్లలో మంటగా అనిపిస్తుండటంతో శుక్రవారం ఆమె కరోనా నిర్ధారన పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం వెల్లడైన ఆ పరీక్షల ఫలితాల్లో కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
కరోనా సోకడంతో నేను సెల్ఫ్ క్వారెంటైన్లో ఉన్నా. కరోనా వైరస్ నా శరీంలో పార్టీ చేసుకుంటున్నదే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా ఇక దాన్ని అంతం చేస్తా. మీరు కూడా దేనికి మీపై అజమాయిషీ చేసే అవకాశం ఇవ్వొద్దు. మీరు కరోనాకు భయపడ్డారంటే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. కరోనా వైరస్ కూడా ఒక చిన్న ఫ్లూ లాంటిదే. కొంచెం ఇబ్బంది పెట్టినా అదే తగ్గిపోతుంది. హర్ హర్ మహదేవ్ అని కంగనా తన పోస్ట్లో పేర్కొన్నారు.
అదేవిధంగా తాను యోగ ముద్రలో ఉన్న ఒక ఫొటోను కూడా కంగనా ఇన్స్టాలో పోస్టు చేశారు. కాగా, కంగనా రనౌత్ ఇటీవల కాలంలో కొవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కనీసం మాస్కు ధరించాలన్న నిబంధనను కూడా ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె కరోనా బారిన పడటం చర్చకు దారితీసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో