అహ్మదాబాద్, డిసెంబర్ 9: గత సంవత్సరం గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏదో కొంత సాయం అందజేసి చేతులు దులుపుకుందామంటే కుదరదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ‘కొంత మంది చేతికి ఎదిగిన కొడుకులను పోగొట్టుకున్నారు. మరి కొందరు భర్తలను కోల్పోయి వితంతువులుగా మారారు.
ఇన్నాళ్లు ఒకరిపై ఆధారపడి బతికిన వీళ్లంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లి పని చేసుకుంటారు. కాబట్టి కొడుకులను కోల్పోయిన వారికి జీవితాంతం పింఛన్ ఇవ్వండి. అలాగే వితంతువులైన వారికి ఉద్యోగం లేదా ైస్టెఫండ్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వీళ్లంతా జీవితాంతం బతికే అవకాశముంటుంది’ అని పేర్కొంది.