అహ్మదాబాద్, అక్టోబర్ 6 : గుజరాత్ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తమ వాదనలను అత్యవసరంగా వినాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతల విషయంలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు దాఖలైంది. వీరికి క్రింది కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని వీరు కోరుతున్నారు.