Gujarat Elections | వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో పాగా వేసే లక్ష్యంతో ఆప్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆదివారం ఐదో విడుతలో 12 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. భుజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజేశ్ పండోరియా, ఇదార్ నుంచి జయంతిభాయ్ పర్ణమి, నికోల్ నుంచి అశోక్ గజేరా, సబర్మతి నుంచి జస్వంత్ ఠాకోరీ, టంకారా నుంచి సంజయ్ భట్సన్, కోడినార్ నుంచి వల్జీభాయ్ మక్వానా, మహుధ నుంచి ఉదైసింగ్ నుంచి రవిజీభాయ్ సోమాభాయ్ వాఘేలాకు సీట్లు కేటాయించింది. మోర్వా నుంచి బవాభా హడాఫ్, దామోర్ నుంచి అనిల్ గరాసియా, ఝలోద్, దేదీయపడ నుంచి చైతర్ వాసవ్, వ్యారా నుంచి బిపిన్ చౌదరి సుమకు ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు కేటాయించింది. ఇదిలా ఉండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 12 సీట్లలో రెండు కాంగ్రెస్, పది బీజేపీ గెలుచుకున్నది.