భావ్నగర్, నవంబర్ 27: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దళితులకు రక్షణ లేకుండా పోతున్నది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద నమోదైన కేసును వెనక్కి తీసుకోలేదనే కోపంతో గీతాబెన్ మరు(45) అనే దళిత మహిళను దుండగులు కొట్టి చంపారు.
భావ్నగర్లో ఆదివారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తమ కుమారుడు పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని గీతాబెన్పై నిందితులు శైలేల్ కొలి, రొహల్ కొలి ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకు ఆమె నిరాకరించారు. దీంతో వారు మరో ఇద్దరితో కలిసి స్టీల్ పైపులతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇండ్ల్లు వదిలి కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లిపోవాలని బెదిరించారు. బాధితురాలు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.