న్యూఢిల్లీ, నవంబర్ 22: ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్పై 18 శాతం జీఎస్టీ పడుతున్నది.
ఇదికూడా ఆన్లైన్ గేమింగ్ పోర్టల్స్ వేస్తున్న ఫీజుల ఆధారంగా సమకూరే స్థూల ఆదాయానికే వర్తిస్తున్నది. దీంతో ఆన్లైన్ గేమింగ్లో పాల్గొనేవారి నుంచి వచ్చే మొత్తం సొమ్ముపై జీఎస్టీ ఉండాలని, అందుకోసం పన్ను గణన పద్ధతిలోనూ మార్పులు తీసుకురావాలని మంత్రుల బృందం జీఎస్టీ మండలిని కోరవచ్చని చెప్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైందని, జీఎస్టీ మండలి పరిశీలనకు దీన్ని త్వరలోనే పంపనున్నట్టు సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి.