న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నివారించే గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చేపట్టనున్నట్టు కేంద్ర క్యాబినెట్ వెల్లడించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేండ్లలో ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రసార భారతి ప్రసార విభాగం, మౌలిక రంగ అభివృద్ధికి క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.2,500 కోట్లతో దూరదర్శన్, ఆలిండియా రేడియోలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. హిమాచల్ప్రదేశ్లో 382 మెగావాట్ల సున్నీ డామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు రూ.2,614.51 కోట్ల పెట్టుబడులు సమకూర్చాలని క్యాబినెట్ నిర్ణయించింది.