వారణాసి, ఆగస్టు 5: గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ ద్వారా భూమి లోపల ఎటువంటి నిర్మాణాల శిథిలాలు ఉన్నా కనిపెట్టవచ్చని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బీఆర్ మణి వెల్లడించారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను భూమి కింద ఉన్న ఉప ఉపరితలంలోకి పంపిస్తారని ఆయన తెలిపారు. ఈ తరంగాలు భూమి కింద నిర్మాణానికి సంబంధించిన ఇటుకలు, ఇసుక, రాళ్లు, పదార్థాలను కనిపెడుతుందని, ఆ దృశ్యాలు మానిటర్లో రికార్డు అవుతాయని వివరించారు. వాటిని నిపుణులు పరీక్షించి అక్కడ గతంలో ఏదైనా నిర్మాణం ఉందా లేదా అనేది నిర్ధారిస్తారని వెల్లడించారు.
నిర్మాణాలకు హాని జరగకుండా సర్వే
జ్ఞానవాపీ మసీదులో శనివారం ఏఎస్ఐ అధికారులు శాస్త్రీయ సర్వే చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్మాణాలకు ఎలాంటి హాని జరుగకుండా సర్వే నిర్వహించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.