తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్రం పార్లమెంట్లో ఓ ప్రకటన చేయాలని భావించింది. ముందుగా అందిన సమాచారం ప్రకారం బుధవారమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఇది వాయిదా పడినట్లు సమాచారం. గురువారం ఈ ఘటనపై కేంద్రం పార్లమెంట్లో ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీకి పూర్తిగా వివరించారు. తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.ఈ హెలికాప్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 13 మంది మృతి చెందినట్లు ధృవీకరిస్తున్నారు….ఇక సీడీఎస్ బిపిన్ రావత్ ఆస్పత్రిలో ఉన్నారని, ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.