న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ ‘తాజా పరిస్థితుల్లో పంట పండించే విధానం మార్చుకోవాలి. ఎం ఎస్పీ ధర ప్రభావవంతంగా, రైతును ఆదుకునేలా, పారదర్శకంగా ఉండాలి. ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది’ అని పేర్కొన్నారు.