ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కరోనా సంక్షోభ సమయంలో సొంతూళ్లకు వెళ్లే క్రమంలో మరణించిన వలస కార్మికులు, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల సమాచారమేదీ తమ వద్ద లేదన్న కేంద్రంలోని మోదీ సర్కారు తాజాగా అలాంటి సమాధానమే మరొకటి చెప్పింది. కరోనా కారణంగా మరణించిన అంగన్వాడీల డాటా ఏదీ తమ వద్ద లేదని స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఓ పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వక సమాధానమిచ్చారు.