న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శలు, జాయింట్ కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, ఇతర అధికారులు అందరూ ఆ ఐదు రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది. పీఎంవో అనుమతి లేకుండా బయటకు ఎక్కడకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.