న్యూఢిల్లీ : ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం జరుగనున్నది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్కు ఆహ్వానించింది. ఈ సారి సమావేశం వర్చువల్గా జరుగనున్నది. వచ్చే సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్గా సభ జరుగనున్నది. కొవిడ్ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను రెండు విడుతలుగా నిర్వహించనున్న విషయం విధితమే. ఈ నెల 31న బడ్జెట్ తొలి విడత సమావేశాలు ప్రారంభమవుతాయని, ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతాయని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతారన్నారు. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఉభయ సభలు షిఫ్టులు వారీగా పని చేస్తాయని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు తొలి విడుతలో ఈ నెల 31న నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడుతలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశం అనంతరం బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం, ఎన్డీయే ఫ్లోర్ లీడర్ల సమావేశం జరుగనున్నట్లు సమాచారం.