న్యూఢిల్లీ : భారత్ నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
భారత్లో గత ఏడాది మార్చి 23 నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తితో అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. గత ఏడాది జులై నుంచి 31 దేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా నిర్ధేశించిన రూట్లలో ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను అనుమతించారు.