ముంబై, మే 1: ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు
. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ లాంటి ఎందరో గొప్ప వ్యక్తుల కష్టం, త్యాగం వల్ల మహారాష్ట్రకు ప్రత్యేక గుర్తింపు లభించిందని కొనియాడారు.