జైపూర్: రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా (Kalraj Mishra) కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో ఇవాళ ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దాంతో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని అక్కడి రాజ్భవన్ ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించింది.ఈ మధ్య కాలంలో గవర్నర్తో సన్నిహితంగా మెలిగిన అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజ్భవన్ ఒక ప్రకటనలో సూచించింది.
అనుమానం ఉన్న అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని రాజ్భవన్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇప్పటికే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.