న్యూఢిల్లీ : దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ప్రయాణికుల తరలింపు, సరుకు రవాణాకే పరిమితమైన భారతీయ రైల్వే కొత్తగా 180 రైళ్లను ‘భారత్ గౌరవ్’ పేరిట ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. భారత దేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా రైళ్లను రూపొందిస్తున్నామని, ఇందు కోసం రైల్వే శాఖ 3033 కోచ్లను గుర్తించిందని, కొత్త రైలు సర్వీసు నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
దేశీయ పర్యాటకాన్ని పెంపొందించడమే ఈ రైళ్ల ఉద్దేశమని పేర్కొన్నారు. పూర్తిగా కొత్త విభామని, సాధారణ రైలు సర్వీసు కాదన్నారు. ఇటీవల రామాయణ్ స్పెషల్ ట్రైన్లో యూనిఫామ్ వివాదంపై ఆయనను ప్రశ్నించగా.. దాని నుంచి పాఠాలు నేర్చుకున్నామన్నారు. మనం సంస్కృతిలో ఏదైనా పాయింట్తో వ్యవహరించినప్పుడు దానికి చాలా సున్నితమైన అంశాలుంటాయన్నారు. ఇంతకు ముందు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో రామాయణ్ ప్రత్యేక రైలులో సేవలందిస్తున్న సిబ్బంది కాషాయ యూనిఫాంను రైల్వే ఉప సంహరించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.