న్యూఢిల్లీ : దేశంలోని అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్ఫోన్ తయారీదారులను కేంద్రం కోరినట్లు తెలుస్తున్నది. అయితే యాపిల్, శాంసంగ్, గూగుల్ సహా పలు కంపెనీలు ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలిసింది. సంచార్ సాథీ యాప్ కోసం ప్రభుత్వం చేసిన సూచనకు కూడా కొన్ని వారాల క్రితం ఇదే వ్యతిరేకత ఎదురైంది. ఆధార్ యాప్ను ప్రీలోడ్ చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం నుంచి జనవరిలో అనధికారికంగా స్మార్ట్ఫోన్ తయారీదారులకు వెళ్లినట్లు తెలుస్తున్నది.
కాలిక్యులేటర్ వంటి ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్ల తరహాలో కొత్త ఫోన్లో బయోమెట్రిక్ గుర్తింపు కార్యక్రమమైన ఆధార్ యాప్ను కూడా దేశంలోని అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ప్రీలోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఫోన్ తయారీదారులను కోరుతున్నది. అయితే ఈ ప్రతిపాదనను స్మార్ట్ఫోన్ తయారీదారులు ప్రాతినిధ్యం వహించే మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఏఐటీ) వ్యతిరేకించినట్లు తెలిసింది.