న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కేంద్రంగా ఇండియాను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ-వెహికల్ విధానాని(E-Vehicle Policy)కి కేంద్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంలో భాగంగా, కనీస పెట్టుబడి సుమారు రూ.4150 కోట్లు ఉండాలి. గరిష్ట పెట్టుబడి ఎంతైనా ఉండవచ్చు. కమర్షియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మూడేళ్ల కాల పరిమితి విధించారు. అయిదేళ్లలో డొమెస్టిక్ వాల్యూ 50 శాతం పెరిగేలా చూడాలి. ఈవీ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే కంపెనీలకు .. అతి తక్కువ కస్టమ్ డ్యూటీకి కార్లను దిగుమతి చేసే అనుమతి ఇవ్వనున్నారు. అన్ని నియమాలకు లోబడి ఉండే కంపెనీలు కనీసం 8వేల ఈవీలను తక్కువ ఇంపోర్ట్ డ్యూటీకి తెప్పించుకునే ఛాన్సు ఉంది.