1.5 లక్షల మంది ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ
న్యూఢిల్లీ, మే 25: లాక్డౌన్ ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో రిక్షా, ఈ-రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు ఢిల్లీ సర్కార్ చేయూతనందించింది. నగరంలోని 1.51 లక్షల మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ. 5,000 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్టు సీఎం కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు.