న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది మమత శర్మ పిల్ దాఖలు చేశారు.