న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం గంపెడు ఆశ పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రూ.48 వేల కోట్లు డివిడెండ్ రూపంలో రావచ్చునని అంచనావేస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనావేసిన రూ.40,953 కోట్ల కంటే ఇది 17 శాతం అధికం. గత బడ్జెట్లో రూ.74 వేల కోట్ల డివిడెండ్ రావచ్చునని అంచనావేసిన కేంద్రానికి దీంట్లో సగం మాత్రమే సమకూరుతున్నది. దీంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల నుంచి మరో రూ.43 వేల కోట్లు రావచ్చునని తెలిపింది.