ఏప్రిల్ నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కారణంగా పగటి పూట ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి.
మనం అంటే నీడ పట్టున ఫ్యాన్ కింద ఉండి సేదతీరుతున్నాం.. కానీ జంతువుల పరిస్థితి ఏంటి?
మిట్ట మధ్యాహ్నం సమయంలో ఓ ఏనుగును నీటి కిందకి తీసుకెళ్తే వేసవి తాపాన్ని ఉపశమనం పొందింది.
బయట ఎండ కంటే అక్కడే హాయిగా ఉండటంతో మావటి వాడు ఎంత నెట్టినా చాలా సేపటి వరకు అక్కడి నుంచి కదల్లేదు. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్లో నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కిందీ దృశ్యం.