కొడంగల్, మే 6 : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ మండలంలోని హస్నాబాద్, అంగడిరైచూర్, బొంరాస్పేట మండలంలోని చౌదర్పల్లి, చిల్ముల్మైల్వార్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతు అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం పూర్తయితే నియోజవర్గంలో లక్ష 17వేల ఎకరాలకు సాగునీరందనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నదన్నారు. రైతులు దళారులను నమ్ముకుని మోస పోవద్దన్నారు. కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్పేట పీఏపీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్లు పకీరప్ప, సయ్యద్ అంజద్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, కొడంగల్ మండల కోఆప్షన్ సభ్యులు ముక్తార్, బొంరాస్పేట మండలంలో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, కొడంగల్, బొంరాస్పేట రైతుబంధు సమితి అధ్యక్షుడు బస్వరాజ్, మహేందర్రెడ్డి, కొడంగల్, బొంరాస్పేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు చాంద్పాషా, టీటీ రాములు, వ్యవసాయాధికారులు ఏడీఏ వినయ్కుమార్, ఏవో బాలాజీప్రసాద్ పాల్గొన్నారు.