న్యూఢిల్లీ: పాన్, ఆధార్ కార్డు లింకింగ్(PAN-Aadhaar Linking)తో సుమారు 600 కోట్లు వసూల్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు ఇంకా 11.48 కోట్ల పాన్ కార్డులు లింక్ కాలేదన్నారు. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ ఈ విషయాన్ని ఇవాళ పార్లమెంట్లో లిఖిత పూర్వక సమాధానం ద్వారా చెప్పారు. ఓ ప్రశ్నకు ఆయన బదులు ఇస్తూ.. గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి 2024 జనవరి 31వ తేదీ వరకు 601.97 కోట్లు వసూల్ అయినట్లు మంత్రి వెల్లడించారు.
పాన్, ఆధార్ లింకింగ్ పెనాల్టీ కింద ఒక్కొక్కరి నుంచి వెయ్యి వసూల్ చేశారు. గత ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉచితంగా పాన్, ఆధార్ లింక్ చేశారు. ఇప్పటికి కూడా లేట్ ఫీజు వసూల్ చేస్తున్నారు. వెయ్యి చెల్లిస్తే పాన్, ఆధార్ను లింక్ చేస్తున్నారు.