కాసర్గడ్: కేరళలోని కాసర్గడ్ జిల్లాలో ఉన్న ఓ స్కూల్లో అయోధ్య ప్రాణ ప్రతిష్ట ఈవెంట్ కోసం సోమవారం సెలవు(School Holiday) ఇచ్చారు. అయితే దీనిపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి నివేదిక కోరారు. వివరాళ్లోకి వెళ్తే.. మధుర గ్రామ పంచాయితీలో ఉన్న శ్రీ గోపాలకృష్ణ ఆలయం ప్రభుత్వ ఫండ్స్తో నడుస్తున్నది. అయితే ఆ ఆలయం నిర్వహిస్తున్న ఓ స్కూల్కు సోమవారం సెలువు ప్రకటించారు. ఇది వివాదానికి దారి తీసింది. పేరెంట్స్, స్థానికులు కోరడం వల్లే స్కూల్కు సెలువు ఇచ్చినట్లు పంచాయితీ సభ్యుడు రాధా పచాకడ్ తెలిపారు. స్కూల్ చుట్టూ ఆలయాలు ఉన్నాయని, అన్నింటా సంబరాలు జరుగుతున్నాయని, ఆ కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనాలన్న ఉద్దేశంతో సెలువు ఇచ్చినట్లు రాధ తెలిపారు.
అయితే కసర్గడ్ జిల్లాలో ఎక్కువగా బీజేపీ ఆధిపత్యం ఉంటోందని, ఆ పార్టీనే 47 ఏళ్ల నుంచి మధుర గ్రామ పంచాయితీపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్కు సెలవు ఇవ్వకుంటే నిరసన చేపడుతామని బీజేపీ బెదిరించినట్లు స్కూల్ ప్రధాన టీచర్ శ్రీహరి తెలిపారు. స్కూల్ వద్ద ఉన్న ఆలయంలో బాణాసంచా కూడా ప్లాన్ చేశారు కాబట్టి, పిల్లలు క్షేమం కోసం సెలువు ఇవ్వాల్సి వచ్చిందని టీచర్ శ్రీహరి తెలిపారు. ఆదివారం సాయంత్రమే డీఈవోకు మెయిల్ కూడా పెట్టినట్లు చెప్పారు. డీఈవో పర్మిషన్ ఇవ్వకున్నా.. సెలువు తీసుకోవడం తప్పుకాదన్నారు.