లక్నో : గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ముర్తజా అబ్బాసి శుక్రవారం ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులపై దాడి చేశాడు. అధికారులు ముర్తజాను ప్రశ్నిస్తుండగా ఆయన దాడికి తెగబడ్డాడు. దర్యాప్తు అదికారులకు ఇప్పటివరకూ సహకరిస్తూ వచ్చిన ముర్తజా అనూహ్యంగా అధికారులపై దాడికి పాల్పడటంతో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఏప్రిల్ 3 సాయంత్రం ఐఐటీ గ్రాడ్యుయేట్ ముర్తజా అబ్బాసీ సెక్యూరిటీ గార్డులపై పదునైన ఆయుధంతో దాడి చేసి గోరఖ్నాధ్ ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. సీఎం యోగి ఆదిత్యానాధ్ తరచూ సందర్శించే గోరఖ్నాధ్ ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
అబ్బాసీ మతపరమైన నినాదాలు చేస్తూ గోరఖ్నాధ్ ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడని నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు తెలిపారు. ముర్తజా అబ్బాసీ ఐఐటీ ముంబై 2015 బ్యాచ్కు చెందిన వాడని కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని ఆయన తండ్రి వెల్లడించారు. కాగా గోరఖ్నాధ్ ఆలయంపై దాడిని యూపీ హోం శాఖ ఉగ్రవాద ఘటనగా అభివర్ణించింది.