పట్నా: బీహార్లో మొకామా, గోపాల్గంజ్ అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. మొకామాలో వార్ వన్సైడ్ అయ్యింది. బీజేపీపై ఆర్జేడీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే మొకామాలో మాత్రం ఆర్జేడీ, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు నడుస్తున్నది. రౌండ్రౌండ్కు ఇద్దరు అభ్యర్థుల నడుమ ఆధిక్యం దోబూచులాడుతున్నది.
22వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఆర్జేడీ అభ్యర్థి మోహన్ప్రసాద్ గుప్తాపై బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు 20వ రౌండ్ పూర్తయ్యే సరికి మోహన్ ప్రసాద్ గుప్తా బీజేపీ అభ్యర్థిపై 1135 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 23వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతున్నది.