చెన్నై: గూగుల్ పిక్సెల్(Google Pixel) స్మార్ట్ఫోన్లను తమ రాష్ట్రంలోనే తయారీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. చెన్నై సమీపంలో ఉన్న కంపెనీలో ఆ ఫోన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే శాంసంగ్, యాపిల్ స్మార్ట్ఫోన్లను రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీఆర్బీ బాలూ ఇటీవల అమెరికాలోని గూగుల్ హెడ్క్వార్టర్స్కు వెళ్లారని, ఫాక్స్కాన్ కంపెనీ అధికారులు కూడా ఉన్నారని, తమిళనాడులో వ్యాపారాన్ని విస్తరించాలన్న అంశంపై చర్చలు జరిగినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఆ చర్చల ఫలితంగానే గూగుల్ అధికారులు తమిళనాడులో గూగుల్ పిక్సెల్ సెల్ఫోన్ల తయారీ యూనిట్ను ప్రారంభించేందుకు అంగీకరించినట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. గురువారం రోజున గూగుల్ సంస్థకు చెందిన అదికారులు చెన్నైలో స్టాలిన్ను కలిశారు. ఈ కంపెనీ వల్ల రాష్ట్రంలోని ఐటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు.