న్యూఢిల్లీ: గూగుల్ సంస్థ భారత్కు చెందిన ఎయిర్టెల్లో సుమారు వంద కోట్ల డాలర్ల(7500 కోట్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నది. కోట్లాది మంది భారతీయులకు స్మార్ట్ఫోన్లను సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆ నిధుల్ని వాడనున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ వ్యాపారాన్ని కూడా విస్తరించనున్నారు. గూగుల్ పెట్టుబడితో.. దేశంలోని చిన్న స్థాయి వ్యాపారులకు సహకారం లభించనున్నది. డిజిటల్ ఎడ్యుకేషన్, పేమెంట్స్, ఈ-కామర్స్ కోసం కావాల్సిన డిజిటల్ టూల్స్ను డెవలప్ చేయనున్నారు. గూగుల్ సంస్థ ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్టులో తెలియజేసింది. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ స్కీమ్ను 2020లో గూగుల్ ప్రకటించింది. దాని ప్రకారం ఎయిర్టెల్లో 1.28 శాతం వాటాను 700 మిలియన్ల డాలర్లు పెట్టి గూగుల్ కొనుగోలు చేస్తోంది. కమర్షియల్ ఒప్పందాల ప్రకారం మరో 300 మిలియన్ల డాలర్లను రానున్న అయిదేళ్లలో ఖర్చు చేయనున్నట్లు ఎయిర్టెల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గూగుల్, ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తంగా 5జీకి కావాల్సిన సాఫ్ట్వేర్ను కూడా డెవలప్ చేయనున్నాయి.