Sundar Pichai : భారత పర్యటనలో ఉన్న గూగల్, ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ రోజ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్లో ముర్ముతో గూగుల్ ఫర్ ఇండియా 2022 ఈవెంట్ గురించి ఆయన కాసేపు మాట్లాడారు. అంతేకాదు ఆమెకు గూగుల్ ఈవెంట్ ప్రతిని అందజేశారు. ముర్ముతో పిచాయ్ దిగిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. భారతదేశ తెలివితేటలు, నైపుణ్యానికి సందర్ పిచాయ్ నిదర్శనమని రాష్ట్రపతి అన్నారు. అంతేకాదు భారతదేశంలో అంతర్జీయ డిజిటల్ అక్షరాస్యత కోసం కృషి చేయాలని ఆమె సుందర్ను కోరారు. ఈ రోజు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమాన్ని గూగల్ నిర్వహిస్తోంది.
ఈ ఈవెంట్ను భారతదేశంలో జరపడం ఇది ఎనిమిదో సారి. గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశాన్ని డిజటలైజేషన్ చేసేందుకు గూగుల్ 2020లో మొదలుపెట్టిన ఫండ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పలు సేవలు, యాప్స్ను గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 20200 ఈవెంట్ను యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్కు సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ తమిళనాడులోని మధురైలో పుట్టారు. ఆయన అసలు పేరు పిచాయ్ సుందరరాజన్. ఆయన 2015లో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఆయనను గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు.
CEO of Google and Alphabet Sundar Pichai called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. The President described Shri Pichai, a recipient of Padma Bhushan, as a symbol of Indian talent and wisdom and urged him to work for universal digital literacy in India. pic.twitter.com/1pfm1xNUd7
— President of India (@rashtrapatibhvn) December 19, 2022