నల్లగొండ/మిర్యాలగూడ/మాడ్గులపల్లి, ఏప్రిల్ 27 : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మనోజ్కుమార్ మాణిక్రావు సూర్యవంశీ అన్నారు. మిర్యాలగూడ, మాడ్గులపల్లి, వేములపల్లి, దామరచర్ల, తిప్పర్తి మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ఎన్నికల్లో వందశాతం పోలింగ్ జరిగేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. బీఎల్ఓలు సకాలంలో ఓటర్లకు ఓటరు స్లిప్లు పంపిణీ చేయాలని చెప్పారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను, డీఆర్ఎస్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ జి.శ్రీనివాస్రావు, తాసీల్దార్లు తదితరులు ఉన్నారు.