న్యూఢిల్లీ : చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా సేఫ్ ల్యాండింగ్ కావడం పట్ల యావత్ దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా మూన్ మిషన్ విజయవంతం కావడంతో ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ నేపధ్యంలో ఇస్రోకు టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. తిరుగులేని విజయం సాధించిన ఇస్రోను సుందర్ పిచాయ్ అభినందించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ అసాధారణ విజయం సాధించిందని, ఇవి అద్భుత క్షణాలని పిచాయ్ ట్వీట్ చేశారు.
ఈ ఘనత సాధించిన ఇస్రోకు అభినందనలని ఆయన రాసుకొచ్చారు. ఇక చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంపై ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ స్పందించారు. పిచాయ్ ట్వీట్పై మస్క్ రియాక్టవుతూ సూపర్ కూల్ అని కామెంట్ చేశారు.
Read More :
Elon Musk | ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టింది.. ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్