అమృత్సర్: పంజాబ్లో ఆదివారం రాత్రి గూడ్స్ రైలు (Goods train) పట్టాలు తప్పింది. రూప్నగర్ వద్ద రైలు పట్టాలపైకి పశువుల మంద రావడంతో లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో 16 బోగీలు పట్టాలు తప్పాయి. రోపర్ థర్మల్ ప్లాంట్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో రూప్నగర్ మార్గంలో పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దుచేశామన్నారు.
కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. వ్యాగన్లు ఒకదానిపై ఒకటి పడిపోయవడంతో ఈ ప్రక్రియ కొద్దిగా ఆలస్యంగా నడుస్తున్నది. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు.
శుక్రవారం రాత్రి దాదర్-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న రైలు ముంబైలోని మాతుంగా స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.