పశ్చిమబెంగాల్ ;పశ్చిమబెంగాల్లో ఆగి ఉన్న రైలును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటన ఆదివారం ఉదయం బంకూరా జిల్లాలోని ఊండా ప్రాంతంలో చోటుచేసుకున్నది. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ డ్రైవర్ చూసుకోకుండా అలాగే ముందుకుపోనివ్వడంతో లూప్లైన్లో ఆగి ఉన్న మరో రైలును గూడ్స్ బండి ఢీకొట్టింది. దీంతో దాదాపు 8 బోగీలు అదుపు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.