Gold Seized | సరిహద్దుల నుంచి భారత్కి స్మగ్లింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. స్మగ్లర్లు విదేశాల నుంచి రహస్యంగా బంగారాన్ని తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కల్యాణి సరిహద్దు ఔట్పోస్ట్ ప్రాంతంలోని సుమారు రూ.2కోట్లకుపైగా బంగారు బిస్కెట్లను జవాన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
145 బెటాలియన్కు చెందిన జవాన్లు పశ్చిమ బెంగాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి బంగారు తరలిస్తున్న యువకుడి పట్టుకున్నారు. స్మగ్లర్ ట్రక్కు డ్రైవర్గా నాటకం ఆడాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ట్రక్కులో తనిఖీలు నిర్వహించగా.. 40 బిస్కెట్లు ఉన్నాయి. ఈ బిస్కెట్ల మొత్తం ఖరీదు రూ.2కోటు ఉంటుందని, డ్రైవర్తో పాటు జవాన్లు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. బంగారం దాదాపు 4667 గ్రాములు ఉంటుందని, మార్కెట్ విలువ రూ.2కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.