న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మళ్లీ రూ.48 వేలకు చేరుకున్నాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.237 పెరిగి రూ.47,994కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,757 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో యెల్లో మెటల్కు డిమాండ్ స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధర పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధర కూడా ఢిల్లీలో స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.153 పెరిగి రూ.71,421కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.71,268 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,874 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.80 అమెరికన్ డాలర్లు పలికింది.