న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతున్నది. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.285 పెరిగి రూ.48,892కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,607 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర పెరగడమే దేశీయంగా బంగారం ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.952 పెరిగి రూ.71,850కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,898 వద్ద ముగిసింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,912 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 28.32 అమెరికన్ డాలర్లు పలికింది.