న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్లో కొంత భాగం కూలింది. స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. (Delhi Metro Station Collapses) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని పింక్ లైన్లో ఉన్న గోకుల్పురి మెట్రో స్టేషన్లో కొంత భాగం కూలింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎలివేటెడ్ ప్లాట్ఫారమ్ సరిహద్దు గోడ, స్లాబ్లో ఒక వైపు పెచ్చులు ఊడాయి. కింద ఉన్న రహదారిపై అవి పడ్డాయి. అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు ఈ శిథిలాల కింద కూరుకుపోయాయి. స్కూటర్పై ఉన్న ఒక వ్యక్తి కూడా శిథిలాల కింద చిక్కుకున్నాడు. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని స్థానికుల సహాయంతో కాపాడారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గోకుల్పురి మెట్రో స్టేషన్లో కొంత భాగం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | A side slab of the boundary wall at Gokulpuri metro station collapsed today. One person injured in the incident was rushed to a nearby hospital, according to Delhi Fire Service.
At least 3 to 4 persons were injured. One person was trapped under the debris and was… pic.twitter.com/I32zCK2nYQ
— ANI (@ANI) February 8, 2024