Goa Bjp | గోవాలో పాలకపక్షమైన బీజేపీకి ఒక్క రోజే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ముఖ్య నేతలు సోమవారమే బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో బీజేపీ నేతలు షాక్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే ప్రవీణ్ జంత్యే బీజేపీకి గుడ్ బై చెప్పగా, మంత్రి మైఖేల్ లోబో కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ సామాన్యుల పార్టీ కాదని, అందుకే గుడ్ బై చెప్పేస్తున్నానని లోబో ప్రకటించారు. మాజీ సీఎం పర్రీకర్ ఆలోచన విధానంతో పార్టీ నడవడం లేదని, ఆయన వర్గీయులకు ప్రస్తుత నాయకత్వం అంతగా గౌరవించడం లేదని ఆయన మండిపడ్డారు. తమతో ప్రస్తుత నాయకత్వం గౌరవపూరితంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నది ఇదమిత్థంగా పేర్కొనలేదు. ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు మాత్రం ప్రకటించారు. ఆయన సన్నిహితులు మాత్రం లోబో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారని పేర్కొంటున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు.