పనాజీ: గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ.. అతిపెద్ద పార్టీగా నిలిచింది.
కాంగ్రెస్ 12 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ 4 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. కాగా, ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ కూటమి కీలకంగా మారనున్నది. ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వారే అధికారం చేపట్టనున్నారు.
అయితే హంగ్ రావడంతో అభ్యర్థులను కాపాడుకోవడానికి పార్టీలు రంగంలోకి దిగాయి. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి.